Startup in Telangana | స్టార్టప్ల అభివ్రుద్ధికి సీఎం కీలక నిర్ణయం
బ్రెజిల్లోని హబ్-గోయాస్ అనే సంస్థతో కుదిరిన ఒప్పందం
Hyderabad : స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ (T-Hub), బ్రెజిల్లోని గోయస్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హబ్ గోయస్ (HUB GOIAS)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసీసీలో హబ్ గోయస్ (HUB GOIAS) ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం T-Hub పౌండేషన్ సీఈవో సుజిత్ జాగిర్దార్, బ్రెజిల్ దేశ గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారాలు ఉంటాయని తెలిపారు.
మార్కెట్ యాక్సెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై టీ-హబ్ (T-Hub), హబ్ గోయస్ (HUB GOIAS) కలిసి పని చేస్తాయన్నారు. రెండు దేశాల స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుందని సీఎం స్పష్టం చేశారు.