CM – Farmers Success meet | కేసీఆర్ కు.. ఆ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది ?
జన్వాడలో కేటీఆర్ కు, మోయినాబాద్లో హరీష్రావుకు ఫామ్ హౌజ్లు ఎలా వచ్చాయి ?
తెలంగాణ రాకముందు మీ అర్థిక పరిస్థితి ఏందీ? మీరు వేల కోట్ల అధిపతులయ్యారు?
రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది?
రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది
తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే మన పోరాటాలు, త్యాగాలు
రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
Hyderabad : గజ్వెల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, జన్వాడలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, మోయినాబాద్లో ఆ పార్టీ సినియర్ నేత హరీశ్రావుకు ఫామ్ హాజ్లు ఎలా వచ్చాయని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండే ? తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు మననం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
రైతుల ముసుగులో, రైతు సెంటిమెంట్ ను పండించి.. ఆదాయ వనరుగా మార్చుకున్నారని, ఈ మేరకు వేల కోట్లు సంపాదించుకున్నారని సీఎం ఆరోపించారు. ఈ రైతు భరోసా విజయోత్సవ సభ వేధిక నుంచి నుంచి సూటిగా అడుగుతున్నా.. వారికి అన్ని కోట్ల రూపాయాలు ఎలా సంపాదించారు అని నిలదీశారు.
సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇవాళ పండుగ చేసుకుంటున్నారు అని, ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ రైతాంగం అండతో, చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని ఆయన చెప్పకొచ్చారు. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే మన పోరాటాలు, త్యాగాలతో ముడిపడి ఉన్నదని, ఉన్న ఊరిని, సొంత భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
* మొదటి ప్రాధాన్యత రైతుకే..
ప్రజా ప్రభుత్వంలో తమ సర్కారు మొదటి ప్రాధాన్యత రైతులు.. ఆ తరువాత ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు అంటూ సీఎం తెలిపారు. ఆనాడు కెసీఆర్ రైతు బందు ఎగ్గొడితే.. తక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7625 కోట్ల నిధులను విడుదల చేశామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని తెలిపారు. 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు రూ. 20 వేల 617 కోట్లు వారి ఖాతాల్లో వేసి, వారిని రుణ విముక్తులను చేశామని చెప్పారు. ఆగస్టు 15, 2024 న రైతులను రుణ విముక్తులను చేశామని తెలిపారు. ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ చెప్పిండు అని, ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం వ్యాపారం చేయదు.. వడ్లు కొనం అని మాట్లాడిండు, కానీ ప్రజా ప్రభుత్వంలో వరి పండించండి.. చివరి గింజ వరకు కొనడమే కాదు, మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని తమ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. తమ మాటపై నమ్మకంతో రైతులు దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా నిలబెట్టారని ఆయన స్పష్టం చేశారు.
*ధాన్యం పండించడంలో తెలంగాణ నంబర్ వన్..
రాష్ట్రంలో.. 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారని సీఎం పేర్కొన్నారు. దళారుల దోపిడీని నిలువరించి రైతును ఆదుకున్న చరిత్ర ప్రజా ప్రభుత్వానిదని అన్నారు. సంబ వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి తమకు అప్పగించారని వారు చెప్పకొచ్చారు.
*మామ శకుని.. అల్లుడు శనీశ్వరుడు..
మామ శకుని అయితే.. అల్లుడు శనీశ్వరుడని, శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు.. జమై రైతులకు తమరే ఏం చేశారని మాట్లాడతుండ్రు.. మరి ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మిండ్రు, రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు, రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు అని సీఎం ధ్వజమెత్తారు. రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టిండు నిజం కాదా? అని ఆయన నిలదీశారు.
* మీకు వేల కోట్లకు అధిపతులయ్యారు..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమరు వేల కోట్ల ది రూపాయలకు అధిపతులయ్యారు? అని రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది? అని సీఎం సూటిగా ప్రశ్నించారు. పదేళ్లలో నిజాం నవాబుల కంటే ఫణవంతులయ్యారు.. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ మాత్రం ఇవాళ దివాళా తీసిందని ఆయన అన్నారు. పదేళ్లు వాళ్లు చేయలేనిది తాము చేశామని, మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని ఆయన స్పష్టం చేశారు.లెక్కబెట్టుకుంటమంటే.. ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూపిస్తా.. పదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పు కేసీఆర్ అని సీఎం సవాలు చేశారు. 18 నెలల్లో 1 లక్షా 4 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం తమదని, రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన ఇది అని, దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఈ వేదిక నుంచి అడుగుతున్నాను అని సవాలు చేశారు.
కాళేశ్వరం పేరుతో మీరు లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో రైతుల కోసం 1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారిని ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రజలారా ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా..ఆలోచన చేయండి. అంచనా కట్టండి.. బేరీజు వేయండని పిలుపునిచ్చారు. పదేళ్లవాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల తమ పాలన ఎలా ఉందో చర్చ పెట్టండని ఆయన స్పష్టం చేశారు. కెసీఆర్.. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, కాళేశ్వరం కూలేశ్వరమై.. లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినాయని ఆరోపించారు. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కెసీఆర్ కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు చెల్లించిండు.. మరి వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయిందో? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
* బీమా, నెట్టంపాడు ఎందుకు పూర్తి చేయలేదు..
రూ. 300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా, 200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదు? 6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది ? దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి.. ఎందుకు పూర్తి చేయలేదు ? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న తమరు.. పదేళ్లలో ఇంకొక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి తము, తమ కుటుంబం కారణం కాదా? అని సీఎం రేవంత్ ప్రతి పక్షానికి ప్రశ్నల వర్షం కురిపించారు. లక్ష కోట్లు దోచుకుని, వేల ఎకరాలు ఆక్రమించుకుని, ఇవాళ బనకచర్ల విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
*అంటకాగాలంటే చద్రబాబుతోనే ఉండేవాణ్ణి..
అంటకాగాలనుకుంటే చంద్రబాబుతో, అక్కడే ఉండేవాణ్ణి కదా? రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని కేసీఆర్.. సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్ లో చేరి ప్రజల్లో కదం కదం కలిపాను అని తెలిపారు. కేసీఆర్..చిత్తశుద్ధి ఉంటే, గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదామని, స్పీకర్ కు లేఖ రాయని డిమాండ్ చేశారు. తమరు చెప్పిన తారీకున అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారని, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో చర్చ చేద్దామని, ఈ మేరకు మొత్తం వివరాలతో తాను వస్తా ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
* * *