Sunday, June 29, 2025

CM Revanth Reddy-Fly Over | న్యూయర్, టోక్యో, సింగపూర్ తో మనం పోటీ పడాలి..

CM Revanth Reddy-Fly Over | న్యూయర్, టోక్యో, సింగపూర్ తో మనం పోటీ పడాలి..
హైదరాబాద్ లో కాలుష్యం యమపాశంగా మారుతోంది..
జంట నగరాల్లో 25 ఏళ్ల పాటు పీజేఆర్ శకం నడిచింది…
పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సభ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
Hyderabad : న్యూయార్క్, టోక్యో, సింగ‌పూర్ వంటి దేశాల‌తో మ‌నం పొటీ ప‌డాల‌ని రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ కు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై న‌గ‌రాలు పోటీ కానే కాద‌న్నారు. ఈ మేర‌కు
శ‌నివారం న‌గ‌రంలోని పీజేఆర్ ఫ్లైవోవ‌ర్ ను ప్రారంభించారు. ఆనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..హైద‌రాబాద్‌లో కాలుష్యం య‌పాశంగా మారుతోంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హైదరాబాద్ కు వలస వచ్చిన వారిపై దౌర్జన్యాలు జరిగితే.. వారికి పీజేఆర్ అండగా నిలిచార‌ని కొనియాడారు. సీఎల్పీ నేత గా పీజేఆర్ పోరాటం అందరికీ తెలుసు న‌ని పేర్కొన్నారు. పీజేఆర్ ఇళ్లు ఒక జనతా గ్యారేజ్ లా ఉండేద‌ని గుర్తు చేశారు. పీజేఆర్ పోరాటం వల్లనే నగరానికి కృష్ణా జలాలు వచ్చా య‌ని ఈ సంద‌ర్బంగా సీఎం స్ప‌ష్టం చేశారు. నగర ప్రజలు మంచి నీటి అవసరాలు తీరాయంటే అది ఆయ‌న‌ చలువనే అని సీఎం అభినందించారు. హైటెక్ సిటీ మహారాష్ట్ర కు తరలి పోకుండా పీజేఆర్ పోరాటం చేశార‌ని చెప్పారు. తెలంగాణ లో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుంద‌ని వివ‌రించారు.
నగరాభివృద్ధి కి కొందరు అవాంతరాలు,అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని, తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్,సేమీ అర్బన్ రీజియన్, రూరల్ తెలంగాణ గా విభజించి ముందుకు అడుగులు వేస్తున్నామ‌ని, ఢిల్లీ నగరం కాలుష్యం కారణంగా నివసించ లేని పరిస్థితిలో ఉంద‌ని తెలిపారు. చెన్నై లో వరద కష్టాలు, బెంగుళూరు లో ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయ‌ని, ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి అని అన్నారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని క్షమించ వద్ద‌ని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గచ్చిబౌలి భూముల్లో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారు అని పేర్కొన్నారు. గచ్చిబౌలి భూములపైన న్యాయపోరాటం చేసి సాధించుకుని లక్షల మందికి ఉపాధి కల్పిస్తామ‌న్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాము ఆగమ‌ని పేర్కొన్నారు. రాబోయే 100 యేళ్లకు సరిపోయేలా నగరాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని, రోడ్ల వెడల్పు, అండర్ పాస్ లు, ప్లై ఓవర్లు నిర్మించబోతున్నామ‌ని తెలుపుతూ.. డీజిల్ బస్సు ల వల్ల హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతుందని వాటిని జిల్లాలకు తరలించామ‌ని అన్నారు.
నగరంలోకి 3 వేల ఎలక్ట్రిక్ బస్సు లసు తీసుకు వస్తున్నామ‌ని, ఆటో ల కొనుగోలు పైన నిషేధాన్ని తొలగించి ఎలక్ట్రికల్, సీఎన్ జీ ఆటోలకు అనుమతి ఇస్తున్నామ‌న్నారు. ఈవీ వెహికల్స్ కు పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపు ఇస్తున్నాం.. హైడ్రా తో ఆక్రమణలు తొలగిస్తున్నాం.. ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం తొలగించింది.. హీరో నాగార్జున స్వయంగా ఎన్ కన్వెన్షన్ కు చెందిన  రెండెకరాలు అప్పగించి నగరాభివృద్ధి కి సహకరించార‌ని సీఎం పేర్కొన్నారు.
40 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకుల ఆక్రమణలో ఉన్న బతుకమ్మ కుంట ను అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు.
2029 లో శేరిలింగంపల్లి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉంద‌ని, మన్మోహన్ సింగ్,  జైపాల్ రెడ్డి వల్ల హైదరాబాద్ కు మెట్రో వచ్చింద‌ని పేర్కొన్నారు. తెలంగాణ పైన కేంద్రం ఎందుకు ఈ వివక్ష చూపుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఎవరు కుట్ర లు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలి..
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles