Good news for Employees | ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ
ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
డిఎ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీ పై 3.6 కోట్లు అదనపు భారం
మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
రేపు ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం
మహిళా సంఘాల ద్వారా తొలి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ లోకి
దశ ల వారీగా 450 బస్సులు.. అద్దె ప్రాతిపదికన ఒప్పందం
రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యం తో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డిఏ ప్రకటిస్తున్నట్లు రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2.5 శాతం డిఏ వల్ల ఆర్టీసీ పై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం వెల్లడించారు.
