Telangana Eapcet-2025 | ఈ నెల 25 నుంచి ఎప్సెట్ దరఖాస్తుల షురూ..
ఆన్లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 4 వరకు గడువు
అలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు గడువు
వివరాలు వెల్లడించిన ఎప్సెట్ కన్వీనర్ డీన్ కుమార్Hyderabad : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీలలో ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరం కోసం నిర్వహించే ఎప్సెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం అవుతుందని కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ గురువారం ప్రకటించారు. అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తో పాటు షెడ్యూల్ గతంలోనే విడుదలైంది. అయితే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల అనంతరం తప్పుల సవరణకు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు మూడు రోజులు గడువు విధించారు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 14 వరకు, రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 18 వరకు, రూ. 5 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
