Telangana KCR | ఎండిన పంట‌లు.. అంద‌ని క‌రెంటు, సాగునీరుపై పోరాటం చేయాలి

Telangana KCR | ఎండిన పంట‌లు.. అంద‌ని క‌రెంటు, సాగునీరుపై పోరాటం చేయాలి
అసెంబ్లీలో తెలంగాణ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం చేయాలి
నేటి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం
స‌భ‌లో అనుస‌రించాల‌ని వ్య‌హాంపై ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు దిశా నిర్దేశం చేసిన కేసీఆర్
Hyderabad : `తెలంగాణ రాష్ట్ర స‌మితి (బిఆర్ఎస్) పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలి. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాలి. బిఆర్ఎస్ మీద ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలి`
అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన లేజిస్లేచ‌ర్ పార్టీ స‌భ్యుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం నేప‌థ్యంలో ప్ర‌జా స‌మ‌స్య‌లు, స‌భ‌లో లేవ‌నెత్తే అంశాల‌పై స‌భ స‌భ్యుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలతో పాటు మంచినీటి కొరత పై అసెంబ్లీలో, మండలి లో పోరాడాల‌ని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతుక‌ వినిపించాల‌ని తెలిపారు. రాష్ట్రం లో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరు పైనా మాట్లాడాల‌ని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఎ ల పెండింగు.. పీఆర్సీ అమలు పై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాల‌న్నారు. మహిళలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని, వాటి కోసం కొట్లాడాల‌ని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల అమలు లో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు.
విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం గురించి, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రహజసమస్యలపై ఎండగట్టాల‌ని సూచించారు. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాల‌న్నారు. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ మండలి లో ప్రభుత్వాన్ని నిలదీయాల‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బిఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలని కేసీఆర్ నేటి సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సంద‌ర్భంగా ఎల్పీ సమావేశం పలు అంశాలపై చర్చించింది. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. అలాగే సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. బిఆర్ఎస్ అధినేత అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్‌ ఎల్పీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో సహా శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version